హైదరాబాద్: 28°C
వార్తలు

వరికుంటపాడులో చెట్ల తొలగింపుపై మండిపాటు

Advertisement

NLR: వరికుంటపాడు మండలం తూర్పు కొండారెడ్డిపల్లిలో చెరువు అభివృద్ధి పనుల పేరుతో విలువైన వేప, టేకు, నల్లతుమ్మ, తెల్లతుమ్మ చెట్లను అక్రమంగా తొలగిస్తున్నారని రైతులు ఆరోపించారు. కాలువ అభివృద్ధి పేరుతో ముందస్తు అనుమతులు లేకుండా చెట్లను నరికివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Advertisement