అన్నమయ్య: బీ కొత్తకోట మండలం నామాలపల్లిలో శనివారం కొబ్బరి బోండాలు దింపుతుండగా కాలు జారి కొబ్బరి చెట్టుపై నుంచి పడి కుళ్లాయప్ప అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వైద్యులు తిరుపతికి తరలించాలని సూచించారు.