BPT: చుండూరులో జూదం ఆడుతున్న ఐదుగురిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో వారి వద్ద నుంచి రూ. 950 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించాలంటే 112కు కాల్ చేయాలని పోలీసులు కోరారు.