KNR: చొప్పదండి మున్సిపల్ సర్వసభ్య సమావేశం శనివారం ఛైర్ పర్సన్ వడ్లూరి సరిత, కమిషనర్ మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు, అమృత్ 2.0 పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. పారిశుద్యం పనులు, మంచినీటి సరఫరా, పన్ను వసూళ్లపై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మానస పాల్గొన్నారు.