JGL: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో రాయికల్ మండలం అల్లీపూర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అథ్లెటిక్స్ పోటీలలో టీ. అనూష,శేషి ప్రియ, నితీషా, బాస్కెట్ బాల్ పోటీలకు ఎన్. షర్మిల ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్, పీడీ క్రిష్ణ ప్రసాద్లు తెలిపారు.ఈ నెల 20-22 వరకు హనుమకొండ, నిజామాబాద్లో జరిగే అథ్లెటిక్స్ బాస్కెట్ బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు.