AP: కాాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. మంటల్లో చిక్కుకుని 20 మంది సజీవదహనం అయ్యారు. అయితే, ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో అక్కడ పరిస్థితి హృదయవిదారకంగా మారింది.