TPT: తూకివాకం పంచాయితీ పరిధిలోని ఎస్.ఎన్.పురంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. పెన్షన్లు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.