కర్నూలు: జిల్లా లక్కవరం గ్రామానికి చెందిన సంగీత ఉపాధ్యాయురాలు పార్వతి ‘మహిళా కీర్తి రత్న ఉమెన్స్ ఎక్సలెన్సీ–2026’ అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మార్చి 8న విజయవాడలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమెకు ఈ పురస్కారం అందజేయనున్నారు. జీ తెలుగు సరిగమప కంటెస్టెంట్గా రాణించిన పార్వతిని పలువురు అభినందించారు.