MDCL: ఉప్పల్ పరిధిలోని గణేష్ నగర్, సెవెన్ హిల్స్, కావేరి నగర్, శ్రీనగర్ ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా మారింది. కాలువల్లో నిల్వ నీరు, చెత్త పేరుకుపోవడం, గుర్రపు డెక్క వల్ల దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం తర్వాత బయటకు రావడం కష్టంగా మారింది. డెంగ్యూ, మలేరియా భయం నెలకొంది.