అనకాపల్లి పట్టణ పరిధిలో నేషనల్ హైవే బైపాస్ రింగ్ రోడ్డు జంక్షన్ నుంచి శారదా నది వంతెన వరకు, పూడిమడక రోడ్డు జంక్షన్ నుంచి గుండాల జంక్షన్ వరకు అలాగే పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ రోప్ లైట్స్ ఏర్పాటు చేశారు. పట్టణ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన లైట్స్ ను శుక్రవారం జనసేన నియోజకవర్గం ఇంఛార్జ్ భీమరశెట్టి రాంకి ప్రారంభించారు.