టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్కు అడుగు దూరంలో నిలిచింది. జింబాబ్వేపై విజయం సాధించిన భారత్, రెండు మ్యాచ్ల్లో 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వెస్టిండీస్ కూడా రెండు మ్యాచ్ల్లో 2 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, చివరి మ్యాచ్లో ఈ రెండు జట్లే తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్కు చేరుకుంటుంది.