VKB: స్వచ్ఛ గ్రామాల లక్ష్యంతో కుల్కచర్ల మండలంలోని చెరువు ముందలితండా గ్రామపంచాయతీలో శుక్రవారం తడి, పొడి చెత్త కోసం వేర్వేరు రంగుల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, వ్యర్థాలను వేరు చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని శుభ్రతపై అవగాహన పెంపొందించారు.