సత్యసాయి: పరిగి మండల కేంద్రంలోని సీతారాంపురం కాలనీ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో తాగునీటి పైప్ లైన్కు లీకేజ్ ఏర్పడి మూడు రోజులుగా నీరు వృథాగా పారుతోంది. తాగునీటి కొరత ఒకవైపు ఉండగా, మరోవైపు ఇలా నీరు వృథా కావడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.