AP: శాసనమండలిలో ఛైర్మన్ కీలక ప్రకటన చేశారు. నిన్న సభను అధికారపక్షం అడ్డుకుందని అన్నారు. లడ్డూపై చర్చ జరగకుండా అధికారపక్షం సభను తప్పుదోవపట్టించిందని తెలిపారు. ఛైర్మన్ వ్యాఖ్యలను మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. తాము దేనికైనా చర్చకు సిద్దమన్నారు. లడ్డూపై చర్చ అంటేనే వైసీపీ సభ్యులు పారిపోతున్నారని ఆరోపించారు.