PDPL: రామగుండం సింగరేణి సంస్థ GDK-1 CSPలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు గుర్తింపు కార్మిక సంఘం (AITUC)లో చేరారు. నాయకులు మడ్డి ఎల్లా గౌడ్ వారికి కండువాలను కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపునకు సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. కార్మికులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారన్నారు.