SRCL: ఇల్లంతకుంటలో ఆరోగ్యలక్ష్మి పథకం అమలును బలోపేతం చేసేందుకు అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి గ్రామ సర్పంచ్ ఎం.రాజు అధ్యక్షత వహించి తల్లి–బిడ్డల ఆరోగ్యమే గ్రామాభివృద్ధికి మూలమన్నారు. 12వ వార్డు సభ్యుడు కూనబోయిన రఘు చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.