CTR: మార్చి నెలలో పుంగనూరులో ప్రతిష్టాత్మకంగా శ్రీసుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ నేపథ్యంలోనే జాతరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. భక్తుల సౌకర్యార్థం చర్యలు చేపట్టనున్నారు. గురువారం మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, సీఐ సుబ్బరాయుడు సంయుక్తంగా కలిసి వాహనాల పార్కింగ్కు స్థలాన్ని పరిశీలించారు.