PLD: ఉపాధిహామీ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి రానున్నారు. ఈ మేరకు వినుకొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రామాంజనేయులు వివరాలు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాలపై భారం మోపుతోందని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన విమర్శించారు.