హైదరాబాద్: 28°C
క్రీడలు

T20 WC: వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఓటమి

మహిళల టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 171 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. అద్భుతమైన బ్యాటింగ్‌తో చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన రిఛా ఘోష్ (68) భారత్‌ను గెలిపించలేకపోయింది.