AP: ఇండియా AI ఇంపార్ట్ సమ్మిట్ – 2026లో CM చంద్రబాబు పాల్గొన్నారు. కృతిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై సమావేశం నిర్వహించారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, WEF CEO బోర్గే బ్రెండే హాజరయ్యారు. సమీప భవిష్యత్లో అమరావతి క్వాంటం వ్యాలీపై ప్రపంచమంతా మాట్లాడే రోజు వస్తుందని చంద్రబాబు అన్నారు. గూగుల్ లాంటి సంస్థల రాకతో APలోని విశాఖ.. AI డేటా హబ్గా మారుతుందన్నారు.