ASR: వారణాసికి చెందిన ప్రముఖ కాశీ పీఠాధిపతులు శ్రీ శివ నాగేంద్ర సరస్వతి స్వామీజీ మార్చి 1 న మండపేట విచ్చేస్తున్నట్లు మండపేట 15 వ వార్డు కౌన్సిలర్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. మార్చి1 నుంచి 5 వరకు మండపేట ధర్మ గుండం చెరువు వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి పీఠం వద్ద ఉంటారని చెప్పారు. 5 రోజులు పాటు స్వామి వారు మండపేటలోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.