PLD: యువతలో ఆసక్తి పెంచేందుకే సీఎం చంద్రబాబు ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ శాసనసభ క్రీడాపోటీల్లో ఆయన పాల్గొన్నారు. తోటి ఎమ్మెల్యేలతో కలిసి వాలీబాల్ ఆడారు. ప్రజలను సంతోషంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, సాంకేతికత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలే ఉత్తమ మార్గమన్నారు.