సత్యసాయి: పుట్టపర్తిలో ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు ఒంటరి మహిళలకు అడిషనల్ ఎస్పీ అంకిత సురాన కుట్టు మిషన్లు అందజేశారు. పద్మావతి, హరిత, అరుణమ్మ అనే మహిళల కుటుంబ పరిస్థితులను గమనించి ఈ సాయం చేశారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అమోఘమని అడిషనల్ ఎస్పీ కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవలు కొనసాగించాలని కోరారు.