NLG: నల్గొండ పట్టణం, పానగల్ పీఏసీఎస్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషాం మాట్లాడుతూ.. యూరియా యాప్ను రద్దు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. సాగుకు అత్యవసరమైన సమయంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాయకులు, రైతులు పాల్గొన్నారు.