AP: మామిడి రైతులకు అదృష్టం వరించింది. కవర్లు తొడిగిన బంగినపల్లి మామిడి టన్ను ధర రూ.1.80 లక్షలు, తోతాపురి రూ.లక్ష పైనే పలుకుతోంది. ప్రభుత్వం కవర్లకు 50% సబ్సిడీ ఇవ్వడంతో ఎక్కువ మంది రైతులు ముందుకొస్తున్నారు. దీంతో పండ్ల నాణ్యత రెట్టింపయ్యిందని, తెగుళ్లు, పక్షులు, జంతువుల నుంచి రక్షణ లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో 10లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.