W.G: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను ఎమ్మెల్సీ గోపిమూర్తి మంగళవారం శాసనమండలిలో ప్రస్తావించారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న వీరిని, అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లోని అన్-ఎయిడెడ్ సిబ్బందిని సైతం రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.