మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని కార్పొరేటర్లు రాచకొండ గోపాల్ రావు, సుధమల్ల హరికృష్ణ కోరారు. శుక్రవారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నాయకులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో నగరాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామన్నారు.