తమిళ నటుడు విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనుండగా.. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు టాక్. 2026 వేసవిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ ‘పాకెట్ నావెల్’తో, సాయి పల్లవి ‘రామాయణ’తో బిజీగా ఉన్నారు.