చిత్తూరు: కార్వేటినగరం మండలంలో మందుబాబుల అడ్డాలుగా ఉన్న ప్రాంతాలను పోలీసులు రూపు మార్చుతున్నారు. ఎస్పీ తుషార్ డూడీ ధైర్య స్పర్శ అనే ఓ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎస్ఐ తేజస్విని సిబ్బందితో కలిసి మందుబాబులకు అడ్డాగా ఉన్న అమ్మపల్లి డ్యాం వద్దకు వెళ్లారు. అక్కడి చెత్త తొలగించారు. మందుబాబులు కూర్చోకుండా ప్రదేశాలను నీటిగా రెడీ చేస్తున్నారు.