MHBD: బయ్యారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో శుక్రవారం ఏవో కే. రాజు తనిఖీలు నిర్వహించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మార్చి 31 నుంచి పారాక్వాట్ నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మందు విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధమని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.