ELR: దెందులూరు మండలం సింగవరం పరిధిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం విలుప్పురం జిల్లాకు చెందిన అన్నామలై శివరాజ్ (37) దుర్మరణం చెందాడని SI శివాజీ తెలిపారు. తమిళనాడు నుంచి వరి కోత యంత్రంతో నల్లజర్ల వెళుతున్న వాహనంలో నుంచి దిగి రహదారి దాటుతుండగా ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ట్రాలీ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.