ATP: ఏపీఎస్పీడీసీఎల్లో నకిలీ ఐటీఐ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లపై వేటు పడింది. ఐటీఐ చదవకుండానే సర్టిఫికెట్లు సమర్పించినట్లు విచారణలో తేలడంతో వారిని తొలగించాలని సీఎండీ శివశంకర్ లోతేటి ఆదేశించారు. వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. అత్యధికంగా కడపలో 38 మందిపై చర్యలు తీసుకున్నారు.