NTR: జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దేవాలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు సమర్పించారు.