సూర్యాపేట మున్సిపాలిటీలోని 27వ వార్డులో గురువారం ‘ఆరోగ్యలక్ష్మి’ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో అంగన్వాడీ సేవలు కీలకమని ఆమె పేర్కొన్నారు.