అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటంతో, అతడిని తుది జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా, మాజీ క్రికెటర్ కైఫ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మిగిలిన మ్యాచ్ల్లో అభిషేక్కు విశ్రాంతినివ్వడం మంచిదన్నాడు. ఇది ద్వైపాక్షిక సిరీస్ కాదని, WCలో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమని చెప్పాడు. అభిషేక్ స్థానంలో శాంసన్ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.