ATP: బొమ్మనహాల్ మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఇంటి వద్దే నగదు పంపిణీ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అర్హులందరికీ పింఛన్ అందజేస్తున్నామని చెప్పారు.