ASF: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం వారికి వరంగా మారిందని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల మార్చ్ నెల వరకు జిల్లాలో రూ.77 కోట్ల ఆదా జరిగిందని పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారని, మహిళల్లో ధైర్యం పెరిగిందన్నారు.