AKP: కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో జామాదులపాలెం సమీపంలో గల వ్యవసాయ బావిలో రైతు గెంజి శివ అప్పారావు (38) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. పొలం పనులకు వెళ్లిన శివ అప్పారావు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 29న వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం బావిలో మృతదేహం కనిపించడంతో బయటికి తీసారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు.