ప్రకాశం: మార్కాపురం మండలంలోని గొట్టిపడియలో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో మార్కాపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో శ్రీరామ నవమి పండుగ వేడుకలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.