AP: నెల్లూరు జిల్లాలో జంట హత్యల కలకలం చోటుచేసుకుంది. కొడవలూరు మండలం గండవరం పొలాల్లో దుండగులు ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. మృతులను దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య (26)గా గుర్తించారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగిందా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.