బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశంలో బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని వెల్లడించారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతోనే బంగారానికి రెక్కలు వచ్చినట్లు చెప్పారు. ఈ పరిణామాలను RBI ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు.