NRML: ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వారు ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.