E.G: నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కాకరపర్రులో శ్రీ గంటాలమ్మ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన గ్రామ దేవత గంటాలమ్మ దేవి కృప దయ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.