అన్నమయ్య: మదనపల్లెలోని ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉన్న పాత బోర్డు పూర్తిగా జీర్ణావస్థకు చేరింది. తుప్పు పట్టి ప్రమాదకరంగా మారినా, ఇప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. ఎప్పటికైనా ఈ బోర్డును తొలగించి కొత్తదాన్ని ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.