HNK: పరకాల మండలంలోని పోచారంలో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని పరకాల మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి ప్రారంభించారు. పశు సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, పాడి రైతులు నిత్యం పశువుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.