RR: తెలంగాణలో నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యాచారం మండలం గున్గల్ గ్రామస్తులైన రైతు కుటుంబానికి చెందిన ఆవ రమాదేవి-జంగయ్యల కుమారుడు ఆవ మోక్షిత్ 95 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి ప్రతిభకు గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.