NLG: కనగల్ మండలంలోని ధర్వేశిపురం, ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో వీధి కుక్కలు తీవ్రమైన చర్మవ్యాధితో కనిపిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వ్యర్థాల వల్ల సోకిన ఈ వ్యాధి మనుషులకు ప్రబలకుండా పశువైద్య అధికారులు తక్షణమే స్పందించి కుక్కలకు చికిత్స అందించాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.