SDPT: ‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ’ అంటూ తెలంగాణ ఆత్మను అక్షరాల్లో ప్రతిబింబించిన ప్రముఖ కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గర్వకారణమని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని తన సాహిత్యంతో అక్షరబద్ధం చేసిన సిద్ధారెడ్డి కృషి అమూల్యమన్నారు. ఈ పురస్కారం ఆయన సాహిత్య ప్రస్థానానికి లభించిన గొప్ప గుర్తింపని పేర్కొన్నారు.