MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చెరువు యొక్క సుందరీకరణ పనులకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భూమి పూజ చేయనున్నారని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చెరువు సుందరీకరణ పనులకు రూ. 314 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఆ పనులకు ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పేర్కొన్నారు.