BDK: సుజాతనగర్ మండలంలో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రమాదేవి హెచ్చరించారు. విత్తనాలు కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యత, గుర్తింపు పొందిన సంస్థకు చెందినవేనా అని నిర్ధారించుకోవాలని సూచించారు. తక్కువ ధరలకు ఆశపడి మోసపోవద్దన్నారు. నకిలీ విత్తనాల రవాణా, నిల్వలపై పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.
వార్తలు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్: ఎస్సై
Advertisement
Advertisement
Advertisement


